కోకాపేట నీటికుంటలో పడి ఆఫ్ఘన్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2020-10-24T09:06:55+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ దేశం నుంచి విద్యాభ్యాసం కోసం నగరానికి వచ్చిన ఓ విద్యార్థి కోకాపేటలోని ఓ నీటికుంటలో పడి మృతి చెందాడు. నూర్ మహ్మద్(26) మెహిదీపట్నంలో
నార్సింగ్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆఫ్ఘనిస్థాన్ దేశం నుంచి విద్యాభ్యాసం కోసం నగరానికి వచ్చిన ఓ విద్యార్థి కోకాపేటలోని ఓ నీటికుంటలో పడి మృతి చెందాడు. నూర్ మహ్మద్(26) మెహిదీపట్నంలో ఉంటూ నిజాం కళాశాల లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం అతడి స్నే హితులు అసదుల్లా, అబ్దుల్ అలీ, ఆరీఫ్ హుస్సేన్తో కలిసి గండిపేటను చూసిన అనంతరం కోకాపేట్ మూవీ టవర్స్ వద్ద ఉన్న ఓ నీటికుంటలోకి దిగి ఈతకొట్టే ప్రయత్నం చేశారు. నూర్ మహ్మద్కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి మిగతా స్నేహితులు నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.