నాగావళి నదిలో విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2022-01-17T04:50:43+05:30 IST

ఆమదాలవలస మండలం బెలమాం వద్ద నాగావళి నదిలో ఆదివారం విశాఖపట్నానికి చెందిన అన్నెపు అనిల్‌ కుమార్‌(21) గల్లంతయ్యాడు. అనిల్‌కుమార్‌ స్వస్థలం సంతకవిటి మండలం వాల్తేరు. కుటుంబ సభ్యులంతా విశాఖ జిల్లా మాదవధారలో స్థిరపడ్డారు. సంక్రాంతి సందర్భంగా తాతగారి గ్రామమైన బెలమాం వచ్చాడు. అందరితో సరదాగా గడిపాడు. తన మేనమామతో కలిసి ఆదివారం మధ్యాహ్నం నదిలో స్నాన్నానికి దిగాడు. నీటిప్రవాహం ఎక్కువవడంతో నదిలోకి జారిపోయాడు.

నాగావళి నదిలో విద్యార్థి గల్లంతు
గల్లంతయిన అనిల్‌ కుమార్‌ (ఫైల్‌)

ఆమదాలవలస, జనవరి 16 : ఆమదాలవలస మండలం బెలమాం వద్ద నాగావళి నదిలో ఆదివారం విశాఖపట్నానికి చెందిన అన్నెపు అనిల్‌ కుమార్‌(21) గల్లంతయ్యాడు. అనిల్‌కుమార్‌ స్వస్థలం సంతకవిటి మండలం వాల్తేరు. కుటుంబ సభ్యులంతా విశాఖ జిల్లా మాదవధారలో స్థిరపడ్డారు. సంక్రాంతి సందర్భంగా తాతగారి గ్రామమైన బెలమాం వచ్చాడు. అందరితో సరదాగా గడిపాడు. తన మేనమామతో కలిసి ఆదివారం మధ్యాహ్నం నదిలో స్నాన్నానికి దిగాడు. నీటిప్రవాహం ఎక్కువవడంతో నదిలోకి జారిపోయాడు. అక్కడే ఉన్న బంధువులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. నది ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో గ్రామస్థులు వచ్చి నదిలో గాలింపు చేపట్టారు. మరోవైపు అగ్నిమాపక రెస్క్యూటీమ్‌, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆదివారం రాత్రి వరకు గాలించారు. అయినా ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రమణమ్మ, కొండలరావు, అన్నయ్య విజయ్‌కుమార్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనిల్‌కుమార్‌ సురక్షింతగా బయటపడాలని దేవుడ్ని వేడుకుంటున్నారు. 

Updated Date - 2022-01-17T04:50:43+05:30 IST