ఏలేరు కాలువలో విద్యార్థి గల్లంతు
ABN , First Publish Date - 2020-10-01T08:13:35+05:30 IST
ఏలేరు రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి దాకమూరి మహేష్(20) అనే యువకుడు బుధవారం గల్లంతయ్యాడు.
ఏలేశ్వరం, సెప్టెంబరు 30: ఏలేరు రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి దాకమూరి మహేష్(20) అనే యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. పట్ణణ పరిధిలోని సాయినగర్కాలనీకు చెందిన దాకమూరి చక్రధర్, లక్ష్మి దంపతుల కుమారుడైన మహేష్ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన స్నేహితుడు చిన్నాతో కలసి మహేష్ పట్టణ శివారు సాయిబాబామెట్టకు సమీపంలోని ఏలేరు కాలువ వద్దకు బహిర్భూమి నిమిత్తం వెళ్లాడు.
నది ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఎస్ఐ శంకరరావు తదితరులు ఈతగాళ్ల సహాయంతో మహేష్ కోసం నది వెంబడి గాలించారు. వరదనీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనపై మహేష్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.