Nuziveedu ట్రిపుల్ ఐటీలో అనారోగ్యంతో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-06-06T15:04:26+05:30 IST

జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్య కారణాలతో పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు.

Nuziveedu ట్రిపుల్ ఐటీలో అనారోగ్యంతో విద్యార్థి మృతి

ఏలూరు: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్య కారణాలతో పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఆర్.నితీష్ కుమార్ అనే విద్యార్థి అర్ధరాత్రి హాస్టల్ రూంలో నోటి వెంట నురగతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు నితీస్‌ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... ప్రాధమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. కాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన విద్యార్థి స్వగ్రామం నెల్లూరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-06T15:04:26+05:30 IST