విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-01-27T05:09:22+05:30 IST

నందిమండలం గ్రామంలో విద్యుత్‌షాక్‌తో పాలగిరి లక్ష్మీకాంత్‌ (20) అనే విద్యార్ధి పొలం వద్ద మంగళవారం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
లక్ష్మీకాంత్‌ మృతదేహం

పెండ్లిమర్రి, జనవరి 26: నందిమండలం గ్రామంలో విద్యుత్‌షాక్‌తో పాలగిరి లక్ష్మీకాంత్‌ (20) అనే విద్యార్ధి పొలం వద్ద మంగళవారం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. ఆ విద్యార్ధి ఉదయాన్నే మోటారు ఆన్‌ చేసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద షాకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విద్యార్థి చెన్నైలోని సబిత ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. లక్ష్మీకాంత్‌కు అన్న ఉన్నాడు. చేతికందివచ్చిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-27T05:09:22+05:30 IST