ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2022-08-20T04:32:59+05:30 IST

సంగారెడ్డి జిల్లా ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని అఖిల(16) శుక్రవారం మరణించింది.

ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో విద్యార్థిని మృతి

పటాన్‌చెరు రూరల్‌, ఆగస్టు 19: సంగారెడ్డి జిల్లా ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని అఖిల(16) శుక్రవారం మరణించింది. సిర్గాపూర్‌ మండలం లొంక తండాకు చెందిన గోప్యా నాయక్‌ కూతురు అఖిల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నదని  టీచర్లు తెలిపారు. శుక్రవారం ఆమె హాస్టల్‌లో బాత్రూంకు వెళ్లి అక్కడే కడుపునొప్పితో కుప్పకూలిందని కళాశాల వర్గాలు తెలిపారు.  వెంటనే బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.   

Updated Date - 2022-08-20T04:32:59+05:30 IST