బైక్ రేసులో గాయపడిన విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-01-27T18:08:40+05:30 IST

బైక్ రేసులో గాయపడిన విద్యార్థి దిల్ షా మృతి చెందాడు. గత రాత్రి పట్టాభిపురం స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ రేస్‌లో..

బైక్ రేసులో గాయపడిన విద్యార్థి మృతి

గుంటూరు : బైక్ రేసులో గాయపడిన విద్యార్థి దిల్ షా మృతి చెందాడు. గత రాత్రి పట్టాభిపురం స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ రేస్‌లో దిల్ షా ప్రమాదానికి గురయ్యాడు. విద్యానగర్ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రేస్ బైక్‌పై వెనక కూర్చున్న దిల్ షా మృతి చెందాడు. తీవ్ర గాయాలతో బైక్‌ను నడిపిన రేసర్ చికిత్స పొందుతున్నాడు.

Updated Date - 2022-01-27T18:08:40+05:30 IST