విద్యార్థి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-10-26T06:07:37+05:30 IST

రూరల్‌ మండలం పెదపలకలూరు సమీపంలోని ఓ కార్పోరేట్‌ స్కూల్‌ హాస్టల్‌లో సోమవారం 9వ తరగతి విద్యార్థి జక్కా శ్రీనాథ్‌(14) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

విద్యార్థి అనుమానాస్పద మృతి
శ్రీనాథ్‌ మృతదేహం

స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం అంటూ తల్లిదండ్రుల ఆందోళన

గుంటూరు(సంగడిగుంట): రూరల్‌ మండలం పెదపలకలూరు సమీపంలోని ఓ కార్పోరేట్‌ స్కూల్‌ హాస్టల్‌లో సోమవారం 9వ తరగతి విద్యార్థి జక్కా  శ్రీనాథ్‌(14) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గురజాలకు చెందిన జక్కా శ్రీనివాస్‌ పెద్ద కుమారుడైన శ్రీనాథ్‌ ఇటీవల సెలవులకు వెళ్ళి 19న హాస్టల్‌కు వచ్చాడు. కాగా సోమవారం  శ్రీనాథ్‌ ఫ్యానకు ఉరి వేసుకున్నాడంటూ స్కూలు నుంచి ఫోన రావడంతో తల్లిదండ్రులు, బంధువులు పెదపలకలూరుకు వచ్చారు. శ్రీనాథ్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు, బంధువులు స్కూలు వద్ద ఆందోళన చేశారు. విచారణ జరిపిస్తామని నల్లపాడు సీఐ ప్రేమయ్య హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని జీజీహెచ మార్చురీకి తరలించారు. 

 

Updated Date - 2021-10-26T06:07:37+05:30 IST