ట్రాక్టర్, ఆటో ఢీ: ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-01-07T05:32:14+05:30 IST
మండల పరిధిలోని గొట్టెళ్ల గ్రామం వద్ద బుధవారం రాత్రి జామాయిల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఆటో ఢీ కొట్టడంతో యువతి దుర్మరణం చెందగా, మరొక యువతి పరిస్థితి విషమంగా ఉంది.
పినపాక, జనవరి 6: మండల పరిధిలోని గొట్టెళ్ల గ్రామం వద్ద బుధవారం రాత్రి జామాయిల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఆటో ఢీ కొట్టడంతో యువతి దుర్మరణం చెందగా, మరొక యువతి పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమరవరం గ్రామానికి చెందిన కుర్సం స్వస్న (20), కుర్సం సరిత పగిడేరు గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహ కార్యక్రమానికి వెళుతున్నారు. ఈ క్రమంలో గొట్టెళ్ల గ్రామం వద్ద జామాయిల్ కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఆటో డ్రైవర్ ఓవర్ టేక్ చేస్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా మరో వాహనం రావడంతో ఆటో వేగాన్ని నియంత్రించే క్రమంలో ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కుర్సం స్వప్న అక్కడికక్కడే మృతి చెందగా, సరిత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సమాచారం అందించారు. ఈలోగానే ప్రైవేటు వాహనంలో పినపాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏడూళ్లబయ్యారం ఎస్సై టీవీఆర్ సూరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఆటోలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారని, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు పరారీలో ఉన్నారని తెలిపారు. చనిపోయిన స్వప్న, గాయపడ్డ సరితలిద్దరూ అన్నదమ్ములైన పగిడయ్య రాములు కూతుళ్లు. స్వస్న బీఎస్సీ నర్సింగ్ చదువుతుండగా, సరిత డిగ్రీ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు.