చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2020-11-29T05:22:42+05:30 IST
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ఘట్కేసర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీ్సస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గోప్యానాయక్ తండాకు చెందిన ఇస్తావత్ రామకిషన్(30) మండలంలోని అవుషాపూర్ గ్రామంలోని వీబీఐటీ కళాశాలలో ఎంటెక్ చదువుతున్నాడు. అతడి స్నేహితుడు హర్భనాయక్తో కలిసి ఈనెల 16నుంచి కుషాయిగూడలో ఉంటున్నాడు. కాగా గత శుక్రవారం కళాశాలలో పరీక్ష రాసి స్నేహితుడితో కలిసి బైక్పై కుషాయిగూడ వెళ్తుండగా పట్టణంలోని మాధవరెడ్డి రైల్వే వంతెన దగ్గర ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రామకిషన్ తలకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.