రైౖలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-27T05:01:10+05:30 IST
రైలు కింద పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
జడ్చర్ల, జనవరి 26 : రైలు కింద పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.కృష్ణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లలోని కావేరమ్మపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి సాయికిరణ్(17) మంగళవారం రాత్రి శికర్గన్పల్లి రైల్వేగేట్ సమీపంలో రైలు కిం ద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ వేయడంతో తల్లిదండ్రులు మందలించారు. క్షణికా వేశానికి గురైన సాయికిరణ్ రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. రాత్రి తల్లిదండ్రులు అతని కోసం ఎక్కడ వెతికినా కన్పించలేదు. బుధవారం ఉదయం శికర్గన్పల్లి రైల్వేగేట్ సమీపంలో వెతకగా అతని మృతదేహం కన్పించింది. సాయికిరణ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృత దేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకున్నట్లు కృష్ణ తెలిపారు.