చదువులో వెనకబడుతున్నానని విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-06T18:59:59+05:30 IST
చదువులో..
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్: చదువులో వెనకబడుతున్నానని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి జయనగర్లో నివాసం ఉండే మారుతీకుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇతడి మేనల్లుడు సాయికృష్ణ మయాంక్(22) కేపీహెచ్బీ ఫేజ్-9లో ఉంటూ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. చదువులో వెనకబడి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో తాను ఉంటున్న గదిలో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ స్నేహితుడు బాలు గమనించి మారుతీకుమార్కు సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.