స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత
ABN , First Publish Date - 2021-04-08T13:09:27+05:30 IST
ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో
వేలూరు(చెన్నై): ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరిగింది. వేలూరు, అనైకట్టు నియోజకవర్గాల ఈవీఎంలను స్థానిక తందై పెరియార్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, కాట్పాడి నియోజకవర్గ ఈవీఎంలను కాట్పాడి ప్రభుత్వ లా కళాశాల, కేవీకుప్పం (రి), గుడియాత్తం (రి) నియోజకవర్గాల ఈవీఎంలు గుడియాత్తం రాజగోపాల్ పాలటెక్నిక్ కళాశాలకు తరలించారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో ఉంచారు. ఆ గదులకు బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేశారు. ఈ గదుల వద్ద సాయుధదళ పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తారని కలెక్టర్ షణ్ముగసుందరం తెలిపారు.