స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉండాలి
ABN , First Publish Date - 2021-04-17T05:09:54+05:30 IST
పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్లు ఉంచిన స్ట్రాంగ్రూమ్ భద్రత పటిష్టంగా ఉండాలని ఎస్ఐ ఆనంద్ రెడ్డి సూచించారు.
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 16: పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్లు ఉంచిన స్ట్రాంగ్రూమ్ భద్రత పటిష్టంగా ఉండాలని ఎస్ఐ ఆనంద్ రెడ్డి సూచించారు. జంగారెడ్డిగూడెం, కుక్కునూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిషత్ ఎన్ని కల బాలెట్ బాక్స్లను వేగవరం నోవా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ను ఎస్ఐ శుక్రవారం పరిశీలించి అక్కడ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. సీసీ కెమేరాల కంట్రోల్ రూమ్ పరిశీలించారు. 24/7 స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నా రు. భద్రత సిబ్బంది అలసత్వం వహించకుండా నిఘా పెట్టాలన్నారు. అనుమతి లేని వారిని పరిసరాలకు కూడా అనుమతించరాదన్నారు.