స్ట్రాంగ్ రూమును పరిశీలించిన నోడల్ అధికారి
ABN , First Publish Date - 2021-02-27T04:02:51+05:30 IST
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్నికల నోడల్ అధికారి ధనలక్ష్మి స్ట్రాంగ్ రూమును పరిశీలించారు.
నాయుడుపేట టౌన్, ఫిబ్రవరి 26 : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్నికల నోడల్ అధికారి ధనలక్ష్మి స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ కళాశాలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఆమె అక్కడ పరిశీలి ంచారు. పట్టణంలో 25 వార్డులకు 50 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డి, డీఎల్పీవో వెంకటరమణ ఉన్నారు.