పార్టీ బలోపేతానికి కృషి చేయండి

ABN , First Publish Date - 2021-08-04T04:55:26+05:30 IST

పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అ న్నారు.

పార్టీ బలోపేతానికి  కృషి చేయండి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారితో మాట్లాడుతున్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), ఆగస్టు 3 : పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అ న్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అని అభిప్రా యపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారితో కలిసి నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పార్టీ అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే బాధ్యతలు ఉంటాయని స్ప ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, నా యకులు శ్రీనివాస్‌రెడ్డి, పవన్‌కుమార్‌ రెడ్డి, కృష్ణవర్దన్‌ రెడ్డి, కిష్ట్యా నాయక్‌, కౌన్సిలర్లు అంజయ్య, రామాంజనేయులు, చెన్నవీరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T04:55:26+05:30 IST