సైబర్ నేరాలపై కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-07-11T08:50:12+05:30 IST
సైబర్ నేరాలపై కఠిన చర్యలు
గుంటూరు, జూలై 10: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయని, ఇటువంటి కేసుల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. మంగళగిరి కార్యాలయంలో డీజీపీని ఆమె కలిసి పై అంశాలపై చర్చించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.