రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-05-21T05:04:27+05:30 IST
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు హెచ్చరించారు.
మిరుదొడ్డి, మే 20: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు హెచ్చరించారు. శుక్రవారం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడారు. అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోళ్లలో వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. మ్యాచర్పేరుతో రైస్మిల్లర్లు రైతులను మోసం చేస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ మిరుదొడ్డి మండలాధ్యక్షుడు దేవరాజు, నాయకులు కనకరాజు, శ్రీనివాస్, ప్రవీన్ తదితరులున్నారు.