డ్రగ్స్‌ వినియోగిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-06-26T06:40:10+05:30 IST

డ్రగ్స్‌ వినియోగం ప్రా ణాంతకమని, వాటిని వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

డ్రగ్స్‌ వినియోగిస్తే కఠిన చర్యలు
ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటక్రైం, జూన్‌ 25: డ్రగ్స్‌ వినియోగం ప్రా ణాంతకమని, వాటిని వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఈ నెల 26న అంతర్జాతీయ అక్రమ రవాణా, డ్రగ్స్‌ వినియో గ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. యువత గంజాయి, డ్రగ్స్‌తోపాటు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నా రు. రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ పి.నాగభూషణం, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:40:10+05:30 IST