గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-10-27T03:59:29+05:30 IST
గంజాయి సాగు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ మోసీన్ అలీ హెచ్చరించారు. మంళవారం గంభీరావుపేట, ఎదులపహాడ్, దోన్ల, తలండి, కన్నెపల్లి, రాంబాబుగూడ, అరటిపల్లి తదితర గ్రామాలను సందర్శించారు.
తిర్యాణి, అక్టోబరు 26: గంజాయి సాగు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ మోసీన్ అలీ హెచ్చరించారు. మంళవారం గంభీరావుపేట, ఎదులపహాడ్, దోన్ల, తలండి, కన్నెపల్లి, రాంబాబుగూడ, అరటిపల్లి తదితర గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాంగా తిర్యాణి మండలంలో తమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీ నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆయన వెంట ఎక్సైజ్ ఎస్సై విలాస్కుమార్, సర్పంచ్ సుజాత, సిబ్బంది విజయలక్ష్మి, కృష్ణమూర్తి, రాజ్కుమార్ పాల్గొన్నారు.