కఠిన చర్యలు తీసుకోవాలి : ఎంపీ
ABN , First Publish Date - 2022-08-16T06:56:48+05:30 IST
ప్రజా సంగ్రామయాత్రపై రాళ్లతో దాడి చేసి బీభత్సవం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేపట్టి న ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై సోయం బాపురావు ఫైర్ అయ్యారు.
ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 15: ప్రజా సంగ్రామయాత్రపై రాళ్లతో దాడి చేసి బీభత్సవం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేపట్టి న ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై సోయం బాపురావు ఫైర్ అయ్యారు. ఫామ్హౌజ్లో ఉండే ముఖ్యమంత్రి ప్రజల కష్టాలను తెలుసుకోలేడు, కేవలం తన పక్షాన పని చేసే విధంగా పోలీ సు వ్యవస్థను తయారు చేసుకుని రాష్ర్టాన్ని తన కుటుంబం చేతులలో ఉండే విధంగా అడుగులు వేస్తున్న కేసీఆర్కు అతి త్వరలో గుణపాఠం చెబుతాం అని సోయం ధ్వజమెత్తారు.
బోథ్: ప్రజా సంగ్రామయాత్ర సందర్భంగా సోమవారం జనగామ జిల్లా దేవరుప్పల్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఆదరణ ఓర్వలేక రాళ్లదాడికి దిగడం సిగ్గుచేటని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొర్ల రాజుయాదవ్ అన్నారు.