కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-04-11T05:15:14+05:30 IST

కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో టీజీవీఎస్‌ కుమార్‌ హెచ్చరించారు.

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రాజాం : మాట్లాడుతున్న ఆర్డీవో కుమార్‌

పాలకొండ ఆర్డీవో కుమార్‌

రాజాం : కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో టీజీవీఎస్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం పట్టణ పరిధిలోని దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణదారులు, షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది విధిగా మాస్క్‌లు ధరించడంతో పాటు శానిటైజర్‌ వినియోగించాలన్నారు. కొనుగోలు కూడా నిబంధనలు పాటించేలా అవగాహన కలిగించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. షాపులను నిరంతరం పర్యవేక్షించాలని తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. మాస్క్‌లు  ధరించని వారికి రూ.250 జరిమానా విధించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.వేణుగోపాలరావు, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:15:14+05:30 IST