‘అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు’
ABN , First Publish Date - 2020-08-15T09:33:37+05:30 IST
సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రాంలో అనుచితమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ
వికారాబాద్: సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రాంలో అనుచితమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అంశాలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రతికూల పోస్టులు చేస్తున్న వారిని పోలీసుశాఖ అత్యంత నిశితంగా గమనిస్తోందన్నారు.