వ్యాపారులకు ఏపీ సర్కార్ శుభవార్త

ABN , First Publish Date - 2020-08-08T02:51:52+05:30 IST

స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో

వ్యాపారులకు ఏపీ సర్కార్ శుభవార్త

అమరావతి: స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నామని సీఎస్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు రూ.7,300 కోట్లు మేర లాభం చేకూరనుంది. అలాగే 3.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్లకు రూ.350 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

Updated Date - 2020-08-08T02:51:52+05:30 IST