విజయవాడలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. గుట్టుగా విచారణ

ABN , First Publish Date - 2020-05-31T16:44:23+05:30 IST

విజయవాడ : జిల్లాలోని పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.

విజయవాడలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. గుట్టుగా విచారణ

విజయవాడ : జిల్లాలోని పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ దాడిలో పలువురు మాజీ రౌడీషీటర్లు పాల్గొన్నట్టు సమాచారం.


ఈ స్ట్రీట్ ఫైట్‌లో ముప్పైమంది యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పలువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పడమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2020-05-31T16:44:23+05:30 IST