చిన్నారిని కరిచి చంపిన ఊరకుక్కలు
ABN , First Publish Date - 2020-07-11T09:02:22+05:30 IST
ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఆరేళ్ల చిన్నారిని ఊరకుక్కలు అతిదారుణంగా కరిచి చంపాయి.
ములుగు, జూలై 10: ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఆరేళ్ల చిన్నారిని ఊరకుక్కలు అతిదారుణంగా కరిచి చంపాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామప్ప-పాకాల పైప్లైన్ పనులు చేసేందుకు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి వచ్చిన కార్మికులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పనులకు వెళ్లి వచ్చిన కార్మికురాలు శుక్రవారం సాయంత్రం తన ఆరేళ్ల కుమారుడిని నివాసం వద్ద వదిలి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే ఉన్న కుక్కల మంద బాలుడిపై దాడిచేసి చంపేశాయి. తిరిగి వచ్చిన తల్లి కుమారుడిని విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోదించింది.