బర్డ్ ఫ్లూ వ్యాప్తికి రైతులే కారణం: బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-01-10T14:52:51+05:30 IST

నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో...

బర్డ్ ఫ్లూ వ్యాప్తికి రైతులే కారణం: బీజేపీ నేత

జైపూర్: నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేత రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతులు అక్కడే చికెన్ తింటూ, దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. దొంగలు, ఉగ్రవాదుల్లా రైతులు ప్రవర్తిస్తున్నారన్నారు. 


ఈ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే దిలావర్ అంతటితో ఆగకుండా... రైతులు దేశం గురించి ఆందోళన చెందడం లేదని, మంచిమంచి వంటకాలు తింటూ, పిక్నిక్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ధర్నాలో పాల్గొంటున్న కొంతమంది రైతులు చికెన్ బిర్యానీతో పాటు కాజూ, బాదాములను తింటూ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా రైతులు దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని అన్నారు. రైతులకు రైతులే శత్రువులుగా మారుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి, రైతులను ఈ ఆందోళనా స్థలం నుంచి ఖాళీ చేయించకపోతే, బర్డ్ ప్లూ పెద్ద సమస్యగా పరిణమిస్తుందన్నారు. జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దిలావర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Updated Date - 2021-01-10T14:52:51+05:30 IST