అనుమతులు లేకుండా దుకాణాలు తెరిస్తే సీజ్
ABN , First Publish Date - 2020-05-25T10:16:43+05:30 IST
లాక్డౌన్ను పురస్కరించుకుని కావలి పట్టణంలో అనుమతులు లేకుండా దుకాణాలు తెరిస్తే మూడు నెలలు సీజ్
కమిషనర్ శివారెడ్డి
కావలి, మే 24 : లాక్డౌన్ను పురస్కరించుకుని కావలి పట్టణంలో అనుమతులు లేకుండా దుకాణాలు తెరిస్తే మూడు నెలలు సీజ్ చేయటం జరుగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ బీ శివారెడ్డి హెచ్చరించారు. కావలిలో మరో కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం పట్టణంలో మైక్ ద్వారా ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేశారు. స్థానిక మేదర బజారును పరిశీలించిన కమిషనర్ ప్రజలు అధిక సంఖ్యలో ఉండటంతో వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వెంట ఆర్వో శేఖర్, ఆర్ఐ సురేంద్ర, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.