టికెట్ సేల్ ఆఫర్ను నిలిపేయండి
ABN , First Publish Date - 2020-08-04T06:14:34+05:30 IST
స్పైస్జెట్ ప్రకటించిన డిస్కౌంట్ టికెట్ సేల్ ఆఫర్ను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది
- స్పైస్జెట్కు డీజీసీఏ ఆదేశం
న్యూఢిల్లీ: స్పైస్జెట్ ప్రకటించిన డిస్కౌంట్ టికెట్ సేల్ ఆఫర్ను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. ‘వన్ ప్లస్ వన్ ఆఫర్ సేల్’ పేరుతో ఒకవైపు ప్రయాణానికి రూ.899 బేస్ ధరతో సరికొత్త ఆఫర్ను సోమవారం నాడు స్పైస్జెట్ తీసుకువచ్చింది. అయితే స్పైస్జెట్ ఆఫర్ ప్రభుత్వం విధించిన టికెట్ ధర పరిమితులకు అనుగుణంగా లేవని పేర్కొం టూ, దీన్ని వెంటనే నిలిపివేయాలని డీజీసీఏ స్పష్టం చేసింది. కాగా డీజీసీఏ మార్గదర్శకాలకు లోబడే తాము ఈ ఆఫర్ను తీసుకువచ్చినట్లు స్పైస్జెట్ తెలిపింది.