వైసీపీ దుష్టపాలనను సాగనంపండి

ABN , First Publish Date - 2022-08-13T05:46:11+05:30 IST

వైసీపీ దుష్టపాలనను సాగనంపండి

వైసీపీ దుష్టపాలనను సాగనంపండి
ర్యాలీలో పాల్గొన నిమ్మక జయకృష్ణ, టీడీపీ నాయకులు

పాలకొండ: రాష్ట్రంలో వైసీపీ దుష్ట పాలనను సాగనంపాలని పాలకొండ నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పిలపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని 1, 2, 11, 20 వార్డుల్లో బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి కి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మళ్లీ చంద్ర బాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. కార్య్రకమంలో పార్టీ నాయకులు గంటా సంతోష్‌, అంపోలు శ్రీను, సుంకరి అనిల్‌దత్‌, పడాల రాంబాబు, వండాన సంతోష్‌, పేకేటి నీలకంఠం పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:46:11+05:30 IST