కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపాలి: వెంకట గోపాలకృష్ణ రావు
ABN , First Publish Date - 2022-02-28T18:19:04+05:30 IST
కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు వెంకట గోపాలకృష్ణ రావు తెలిపారు.
అమరావతి: కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు వెంకట గోపాలకృష్ణ రావు తెలిపారు. సోమవారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు వెంకట గోపాలకృష్ణ రావు వినతి ప్రత్రం ఇచ్చారు. ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కృష్ణానది నీటి వాటాను 70:30 శాతం కేటాయించాలని వెంకట గోపాలకృష్ణ రావు అన్నారు.