మట్టి లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-04-19T06:03:44+05:30 IST

మానేపల్లి ఏటిగట్టుపై నుంచి హైవే అభివృద్ధి కోసం మట్టిని లారీల్లో తరలిస్తున్నారు.

మట్టి లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

పి.గన్నవరం, ఏప్రిల్‌ 18: మానేపల్లి ఏటిగట్టుపై నుంచి హైవే అభివృద్ధి కోసం మట్టిని లారీల్లో తరలిస్తున్నారు. లారీలు తిరగ డంతో ఏటిగట్టు అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆదివారం లారీలను అడ్డుకున్నారు. మట్టి పక్కదారి పడుతోందని, అనుమతులకు మించి మట్టి తవ్వుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మానేపల్లిలంక నుంచి మట్టి తరలించేందుకు మైన్స్‌ అధికారుల అనుమతులు ఉన్నాయని తహశీల్దార్‌ బి.మృత్యంజయరావు వివరణ ఇచ్చారు. మట్టి పక్కదారి పట్టడం, అనుమతులకు మించి తవ్వకాలు జరపడం వంటి విషయాలు మైన్స్‌ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు.



Updated Date - 2021-04-19T06:03:44+05:30 IST