పర్సెంటేజ్‌ల కోసం పనులు ఆపుతారా?

ABN , First Publish Date - 2022-01-22T05:36:43+05:30 IST

పర్సంటేజ్‌లు ఇవ్వకపోతే వైసీపీ నేతలు, కార్పొరేటర్లు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ను ఆపడం దుర్మార్గమని టీడీపీ నేతలు మండి పడ్డారు.

పర్సెంటేజ్‌ల కోసం పనులు ఆపుతారా?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు



- వైసీపీ నేతలు, కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలి

- టీడీపీ నియోజకవర్గ  నేతల మండిపాటు

అనంతపురం వైద్యం, జనవరి21: పర్సంటేజ్‌లు ఇవ్వకపోతే వైసీపీ నేతలు, కార్పొరేటర్లు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ను ఆపడం దుర్మార్గమని టీడీపీ నేతలు మండి పడ్డారు. పార్టీ నియో జకవర్గ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ అధికార ప్రతినిధులు సరి పూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌; ఉపాధ్యక్షుడు డిష్‌ నాగ రాజు, టీఎనటీయూసీ అధ్యక్షుడు వెంకటేష్‌ గౌడ్‌, తెలుగుయువత రాష్ట్ర నాయకుడు బంగినాగ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అశోక్‌ నగర్‌ బ్రి డ్జి నిర్మాణం కోసం దాదాపు రూ. 22కోట్లను అమృత పథకం కింద మం జూరు చేయించారన్నారు. ఆ పనులకు టెండర్లు పిలిచారన్నారు. ఆ టెం డర్‌దారుడు పనులు చేస్తుంటే వైసీపీ నాయకులు, కార్పొరేటర్‌ 10శా తం కమీషన ఇస్తేనే పనులు చేయాలని దౌర్జన్యానికి దిగడం బాధాకర మన్నారు. అలాగే విద్యుతనగర్‌ నుంచి జేఎనటీయూ రోడ్డు వరకు బీటీ రోడ్డు, డివైడర్ల కాలవల నిర్మాణానికి రూ. 6.5కోట్లకు టీడీపీ హయాం లోనే టెండర్‌ పూర్తి చేశారన్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్‌ పనులు మొ దలుపెడితే వైసీపీ నాయకులు కమీషన కోసం బెదరించి నిలిపివేయిం చి, బిల్లు రాకుండా చూడడం సిగ్గుచేటన్నారు. నగరంలో వైసీపీ నాయ కులు డబ్బు కోసం ఎలా దౌర్జన్యాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవు తోందన్నారు. ఇంత బహిరంగంగా బెదరిం పులకు దిగి కమీషన్లకు పాల్పడుతున్న వైసీపీ నాయకులు, కార్పొరేటర్ల పై చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పూల బాషా, జేఎం బాషా, గంగవరం బుజ్జి తదితరులు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:36:43+05:30 IST