కడప- బెంగళూరు రైల్వేలైన్‌ దారి మళ్లించొద్దు: జనసేన

ABN , First Publish Date - 2022-01-20T05:10:52+05:30 IST

కడప- బెంగళూరు రైల్వే లైన్‌ దారిమళ్లించొద్దని జనసేన నాయకుడు మైఫోర్స్‌ మహేష్‌ డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలోని రాయచోటి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వేలైన్‌ కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందన్నారు.

కడప- బెంగళూరు రైల్వేలైన్‌ దారి మళ్లించొద్దు: జనసేన
ప్రసంగిస్తున్న మైఫోర్స్‌మహేష్‌

మదనపల్లె అర్బన్‌,జనవరి 19: కడప- బెంగళూరు రైల్వే లైన్‌ దారిమళ్లించొద్దని జనసేన నాయకుడు మైఫోర్స్‌ మహేష్‌ డిమాండ్‌ చేశారు.  ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలోని రాయచోటి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వేలైన్‌ కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. రైల్వేలైన్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లించడాన్ని తప్పించుకోవడానికే రాష్ట్రప్రభుత్వం బెంగళూరు రైల్వేలైన్‌ మార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. మదనపల్లె మీదుగా 250 కిలోమీటర్ల రైల్వేలైన్‌ వేయడానికి  కేంద్రం సర్వే నిర్వహించందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాకింద రూ.1500 కోట్లు ఇవ్వాల్సి రావడంతో... ముద్దనూరు, పులివెందల,  ముదిగుబ్బ మీదుగా దారిమళ్లిస్తే 72 కిలోమీటర్లు మాత్రం నిర్మిస్తారన్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యేలు దీన్ని అడ్డుకోవాలని కోరారు. 

Updated Date - 2022-01-20T05:10:52+05:30 IST