ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2022-08-07T04:50:10+05:30 IST

భారతీ య జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు మానుకుని రాయచోటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీజేపీ మేధావుల విభాగం సభ్యుడు డాక్టర్‌ పాలగిరి శ్రీనివాసకుమార్‌రాజు, పట్టణ అధ్య క్షుడు నిర్మల్‌కుమార్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి సూచించారు.

ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి
మాట్లాడుతున్న శ్రీనివాసకుమార్‌రాజు

 రాష్ట్ర బీజేపీ మేధావుల సంఘం సభ్యుడు శ్రీనివాసకుమార్‌రాజు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 6: భారతీ య జనతా  పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు మానుకుని రాయచోటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీజేపీ మేధావుల విభాగం సభ్యుడు డాక్టర్‌ పాలగిరి శ్రీనివాసకుమార్‌రాజు, పట్టణ అధ్య క్షుడు నిర్మల్‌కుమార్‌ ఎమ్మెల్యే గడికోట   శ్రీకాంత్‌రెడ్డికి సూచించారు. శని వారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒకే పార్టీలో ఉంటూ, ఒకే విధానం పాటిస్తూ, ఒకే జాతీయ వాదంతో ఉండే వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. ఆయ నను గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తమకు అర్థం కాలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు క్రమం తప్పకుండా వస్తున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రం నుండి నిధులు విడుదల చే యించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు, రాయచోటికి రైల్వేలైన్‌ను ఎప్పుడు తెప్పిస్తారో  తెలియజేయాలని సలహా ఇచ్చారు. 

Updated Date - 2022-08-07T04:50:10+05:30 IST