Stock Market: నష్టాలతో ముగిసిన సూచీలు!
ABN , First Publish Date - 2021-06-04T21:41:45+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) నష్టాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. 52,367 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 132 పాయింట్లు కోల్పోయి 52,100 వద్ద ముగిసింది. ఇక, 15,712 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 15,670 వద్ద స్థిరపడింది.
గ్రాసిమ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సెర్వ్, కోల్ ఇండియా లాభాలను ఆర్జించాయి. నెస్లే, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచనున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం వ్యతిరేకత పెంచింది. అలాగే కొన్ని కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడం కూడా సూచీల నష్టాలకు కారణమైంది.