లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-05-05T21:40:22+05:30 IST

ఈ రోజు (బుధవారం)ను సానుకూలంగా ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా అదే ధోరణిని కనబరిచాయి.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

ఈ రోజు (బుధవారం)ను సానుకూలంగా ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా అదే ధోరణిని కనబరిచాయి. కీలక రంగాల షేర్లు రాణించడంతో లాభాలతో ముగిశాయి. 48,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరికి 424 పాయింట్లు లాభపడి 48,677 వద్ద ముగిసింది. ఇక, 14,604 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ 121 పాయింట్లు ఎగబాకి 14,617 వద్ద స్థిరపడింది.

 

ఆర్బీఐ పలు ప్రోత్సాహకాలు ప్రకటించడం సూచీలకు దన్నుగా నిలిచింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఆసియన్ పెయింట్స్ నష్టాలను చవిచూశాయి. 

Updated Date - 2021-05-05T21:40:22+05:30 IST