నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-23T21:27:16+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నడిచాయి

నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నడిచాయి. ఈ రోజును నష్టాలతో ముగించాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టాయి. 47,863 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 202 పాయింట్లు కోల్పోయి 47,878 వద్ద రోజును ముగించింది. ఇక, 14,326 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద రోజును ముగించింది. 


పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. ఎమ్ అండ్ ఎమ్, బ్రిటానియా, రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో నష్టాలను చవిచూశాయి. కరోనా, లాక్‌డౌన్ భయాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే ఈ వారంలో ట్రేడింగ్‌కు చివరి రోజు కావడంతో చాలా మంది అమ్మకాలకు ఎగబడ్డారు. 

Updated Date - 2021-04-23T21:27:16+05:30 IST