కరోనా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
ABN , First Publish Date - 2021-04-12T15:38:02+05:30 IST
కరోనా కేసులు భారీగా పెరగటం, చాలా నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
కరోనా కేసులు భారీగా పెరగటం, చాలా నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1000కి పైగా పాయింట్లను నష్టపోయింది. 48,956 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 1174 పాయింట్లు కోల్పోయింది. ఇక, 14,644 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ ఉదయం 10 గంటల సమయానికి 350 పాయింట్లు నష్టపోయింది. సిప్లా, రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ50 సూచీలోని దాదాపు 40కిపైగా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ రోజే (సోమవారం) వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.