భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-12T21:08:39+05:30 IST

కరోనా రెండో దశ ఉద్ధృతి దేశీయ స్టాక్ మార్కెట్లను ముంచేసింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు.

భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

కరోనా రెండో దశ ఉద్ధృతి దేశీయ స్టాక్ మార్కెట్లను ముంచేసింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. 48,956 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 1707 పాయింట్లు కోల్పోయి 47,883 వద్ద రోజును ముగించింది. ఇక, 14,644 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ 524 పాయింట్లు కోల్పోయి 14,310 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.


రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా లాభాలను ఆర్జించగా.. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలను చవిచూశాయి. దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది.

Updated Date - 2021-04-12T21:08:39+05:30 IST