5 రోజుల నష్టాలకు తెర
ABN , First Publish Date - 2021-02-24T08:07:18+05:30 IST
వరుసగా ఐదు రోజుల నష్టాలకు స్టాక్మార్కెట్ తెర దించింది. ఎంపిక చేసిన ఎనర్జీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రా షేర్లలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా మొగ్గు చూపడం ఇందుకు కారణం...
ముంబై: వరుసగా ఐదు రోజుల నష్టాలకు స్టాక్మార్కెట్ తెర దించింది. ఎంపిక చేసిన ఎనర్జీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రా షేర్లలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా మొగ్గు చూపడం ఇందుకు కారణం. ఇంట్రాడేలో 667 పాయింట్ల మేరకు ఊగిసలాడిన సెన్సెక్స్ ఎట్టకేలకు 7.09 పాయింట్ల స్వల్ప లాభంతో 49751.41 వద్ద ముగియగా నిఫ్టీ 32.10 పాయింట్ల లాభంతో 14707.80 వద్ద ముగిసింది.