దుర్గంధం

ABN , First Publish Date - 2022-04-29T04:47:26+05:30 IST

మండలంలోని పుల్లంపేటలో పుల్లంగేరు నుంచి వచ్చే పంట కాలువ చెత్తా చెదారంతో నిండి దుర్గంధబరితంగా తయారైంది. ఈ పంట కాలువకు ఇరువైపులా గృహాలు నిర్మించుకున్న కొందరు మురుగునీటిని కాలువలోకి వదులుతుండడంతో ఈ కాలువ దుర్గంధం, దుర్వాసనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా ఈ పంట కాలువ అపరిశుభ్రంగా ఉండటంతో కాలువ సమీప ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ కాలువలో నిత్యం పందులు తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

దుర్గంధం
పుల్లంపేటలో మురుగు నీటితో నిండిన పంట కాలువ

ఏళ్లు గడుస్తున్నా తొలగని మురుగు

పందులు, దోమలకు నిలయంగా పుల్లంపేట పంట కాలువ  

పుల్లంపేట, ఏప్రిల్‌ 28: మండలంలోని పుల్లంపేటలో పుల్లంగేరు నుంచి వచ్చే పంట కాలువ చెత్తా చెదారంతో నిండి దుర్గంధబరితంగా తయారైంది. ఈ పంట కాలువకు ఇరువైపులా గృహాలు నిర్మించుకున్న కొందరు మురుగునీటిని కాలువలోకి వదులుతుండడంతో ఈ కాలువ దుర్గంధం, దుర్వాసనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా ఈ పంట కాలువ అపరిశుభ్రంగా ఉండటంతో కాలువ సమీప ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ కాలువలో నిత్యం పందులు తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఎన్నో మార్లు కాలువ పనులు చేపట్టినా మురుగు నీటిని మాత్రం తొలగించడం లేదు. మురుగునీరు కాలువలోకి వదలవద్దని పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా ఫలితం శూన్యం. గతంలో ఈ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉండటంతో జ్వరాల బారిన పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పుల్లంపేట మధ్య భాగంలో ఈ కాలువ ఉండటంతో ఈ కాలువలో మురుగు వల్ల దోమలు ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలువ పక్కనే జూనియర్‌ కళాశాల, ప్రాథమికోన్నత పాఠశాల, బస్టాండు ఉన్నాయి. సాయంత్రం అయితే దోమలు ఝుమ్‌.. ఝుమ్‌... అంటూ చెవుల వద్ద మోతలు మోగిస్తుంటాయి. అధికారులు చర్యలు తీసుకుని కాలువలో మురుగు నీరు వదలకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-29T04:47:26+05:30 IST