ఆచూకీ లభ్యం కాని గల్లంతైన యువకుడు

ABN , First Publish Date - 2020-11-30T06:23:39+05:30 IST

గార్గేయ నదిలో గల్లంతైన యువకుడు ఆదివారం సైతం లభ్యం కాలేదు.

ఆచూకీ లభ్యం కాని గల్లంతైన యువకుడు

ఐరాల, నవంబరు 29: గార్గేయ నదిలో గల్లంతైన యువకుడు ఆదివారం సైతం లభ్యం కాలేదు. పూతలపట్టు మండలం తలపులపల్లె గ్రామానికి చెందిన మురళీమోహన్‌రెడ్డి కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఐరాలలోని తన అక్కవాళ్ల ఇంటికి బయలుదేరి వస్తూ మార్గమధ్యంలోని చవటపల్లె వద్ద గార్గేయ నది(వంక)ను దాటే క్రమంలో గల్లంతైన సంగతి విదితమే. రెండు రోజులుగా రెస్క్యూ టీమ్‌ గాలింపు చర్యలు చేపట్టిన యువకుడు లభ్యం కాలేదు. రెస్క్యూ టీమ్‌ సభ్యులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. యువకుడు లభ్యం కాకపోవడంతో తలపులపల్లెలో విషాదం అలుముకుంది. 

Updated Date - 2020-11-30T06:23:39+05:30 IST