డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు

ABN , First Publish Date - 2021-07-24T05:59:41+05:30 IST

అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజ య్‌ కుమార్‌ అన్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌ , జూలై 23 : అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజ య్‌ కుమార్‌ అన్నారు. పటణంలోని జలమయమైన 8వ, వార్డును ఎ మ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం తరుపున 50 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను ప్రముఖ వైద్యుడు రాచకొండ శ్రీనివాస్‌-నాగరత్న దంపతులు సమకూర్చగా ఎమ్మెల్యే సంజయ్‌ కు మార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల ర్లు వానరాసి మల్లవ్వ తిరుమలయ్య, కప్పల శ్రీకాంత్‌, తహసీల్ధార్‌ వెంకటేష్‌, డీప్యూటీ తహసీల్ధార్‌ రాజేంద్ర ప్రసాద్‌, ఆర్‌ఐ ఖాజీమ్‌ అలీ ఉన్నారు.


Updated Date - 2021-07-24T05:59:41+05:30 IST