కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-04-13T05:38:10+05:30 IST
గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల కలెక్టర్ రవి
మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 12 : గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని కొండ్రికర్ల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ పర్యటించారు. పాజిటివ్ వచ్చిన వారు బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ వైద్యుల సూచనలు పా టించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను ఇంటి వద్దకు పంచాయతీ సిబ్బందితో పంపించాలన్నారు. గ్రామంలో జరిగిన జాత రలో పాల్గొన్న వారిని గుర్తించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని మండల వైద్యాధికారి నరేందర్కు సూచించారు. ప్రతిరోజు పారిశుధ్య పనులను చేపట్టాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. కలెక్టర్ పర్యటిస్తు న్న సమయంలో మాస్కు లేకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్న బద్దం రమణకు రూ.వెయ్యి జరిమానా విధిం చాలని కార్యదర్శి హేమలతకి ఆదేశించారు. ఈయన వెంట డీఎంహెచ్వో శ్రీధర్, డీపీవో పల్లికొండ నరేశ్, ఎంపీడీవో గున్నాల కల్పన, ఏపీవో తిరుపతిరావు, సర్పం చ్ ఆకుల రాజగంగు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.