నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్ : స్టీఫెన్ రవీంద్ర
ABN , First Publish Date - 2022-01-13T19:18:43+05:30 IST
నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ముఠా క్లోనింగ్ చేస్తోంది. మొహాలీ, పంజాబ్కి చెందిన ఏడుగురు ముఠాను సైబారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా ఉన్నాడు. విదేశాల్లో ఉన్న వారికి క్రెడిట్ కార్డులను ముఠా సప్లై చేస్తోంది. ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను ముఠా అమ్ముతోంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు’’ అని వెల్లడించారు.