దశలవారీగా సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-14T05:49:47+05:30 IST

దశలవారీగా సమస్యల పరిష్కారం

దశలవారీగా సమస్యల పరిష్కారం
సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న చైర్‌పర్సన్‌ వసుపతి ప్రణీత తదితరులు

కీసర రూరల్‌, ఆగస్టు 13 : దశలవారీగా మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరింపబడుతాయని దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రణీత అన్నారు. శనివారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల నిర్వహణకు గాను రూ.15కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం క్యాబినెట్‌ సమావేశంలో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. దీంతో చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో దమ్మాయిగూడలోని ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:49:47+05:30 IST