ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ

ABN , First Publish Date - 2021-09-29T06:34:51+05:30 IST

కార్మికుల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు 229వ రోజు కొనసాగాయి.

ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ
రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 28: కార్మికుల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు 229వ రోజు కొనసాగాయి. ఈ శిబిరంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉద్యోగులు, నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉక్కు కర్మాగారాన్ని  ప్రైవేటీకరణ  చేయకుండా సెయిల్‌లో లేదా ఎన్‌ఎండీసీలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. పోరాట కమిటీ మరో చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 30న తలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌ దిగ్బంధంలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, ఎన్‌.రామారావు, వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌,   జెర్రిపోతుల ముత్యాలు, గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, మస్తానప్ప, రామ్మోహన్‌ కుమార్‌, బొడ్డు పైడిరాజు, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, దొమ్మేటి అప్పారావు, నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2021-09-29T06:34:51+05:30 IST