ఉక్కు సంకల్పం
ABN , First Publish Date - 2021-10-19T06:18:38+05:30 IST
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ ప్రవేశద్వారం వద్ద పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి మంగళవారం నాటికి 250 రోజులు అవుతోంది.
ఉద్యమానికి 250 రోజులు
నేటి ఉదయం 8 గంటల నుంచి 250 మందితో 25 గంటలు నిర్విరామ దీక్ష
ఉక్కుటౌన్షిప్, అక్టోబరు 18: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ ప్రవేశద్వారం వద్ద పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి మంగళవారం నాటికి 250 రోజులు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 250 మంది కార్మికులతో 25 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు పోరాట కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈ దీక్షలను ప్రారంభించారు.