ప్లీజ్‌.. ఇళ్లలోనే ఉండండి

ABN , First Publish Date - 2020-03-28T10:35:32+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా సారా విక్రయాలను అదుపు చేసేందుకు వెళుతుండగా వాహనం అదుపుతప్పి పడిపోవడంతో...

ప్లీజ్‌.. ఇళ్లలోనే ఉండండి

తాళ్లపూడి, మార్చి 27 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా సారా విక్రయాలను అదుపు చేసేందుకు వెళుతుండగా వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తాళ్లపూడి ఎస్‌ఐ సతీశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో సెలవు మంజూరు చేయకపోవడంతో గాయాలతోనే ఎస్‌ఐ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి పోలీసులకు సహకరించాలని  ఆయన కుమార్తెలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలో ఒక ఎస్‌ఐపై చర్యలకు అధికారులు సిద్ధం కావడంతో పోలీస్‌ యంత్రాంగంలో శుక్రవారం మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు లాక్‌డౌన్‌ విధుల్లో సీరియస్‌గా ఉన్న సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించారు. నామమాత్రంగా తమ విధులు కొనసాగించారు. మధ్యాహ్నం వరకు కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్‌ బంకులు పనిచేశాయి.

Updated Date - 2020-03-28T10:35:32+05:30 IST